న్యూస్రీల్
శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5884 టీఎంసీలు.
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 536.30 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 18,516 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.9200, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది.
నవమి వేళ.. కల్యాణ కళ
శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కనుల పండువగా నిర్వహించారు. నగరం, పట్టణాలలోని ప్రధాన రహదారులు సహా వీధుల్లోని ఆలయాలలో శ్రీసీతారాముల కల్యాణం మహోత్సవాలు ఘనంగా జరిపించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కల్యాణ వేడుకను తన్మయంతో తిలకించి తరించారు. ఉత్సవం అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయాల వద్ద భారీ ఎత్తున తాటాకు పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. – పెదకూరపాడు
7


