చతికిల పడిన మార్కెట్‌ కమిటీలు | - | Sakshi
Sakshi News home page

చతికిల పడిన మార్కెట్‌ కమిటీలు

Sep 29 2025 8:12 AM | Updated on Sep 29 2025 8:12 AM

చతికిల పడిన మార్కెట్‌ కమిటీలు

చతికిల పడిన మార్కెట్‌ కమిటీలు

కొరిటెపాడు (గుంటూరు వెస్ట్‌): జిల్లాలోని అన్ని మార్కెట్‌ కమిటీలు ఫీజు వసూళ్లలో డీలా పడ్డాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గుంటూరు జిల్లాలో ఉన్న ఎనిమిది మార్కెట్‌ కమిటీలు, 15 చెక్‌ పోస్టుల ద్వారా రూ.146.31 కోట్లు రాబట్టాలని మార్కెటింగ్‌ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు నెలాఖరుతో ముగిసిన ఐదు నెలల కాలంలో రూ.43.12 కోట్లు మాత్రమే వసూలైంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.53.58 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

● గుంటూరు మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ.115 కోట్లు కాగా, ఆగస్టు నాటికి 29.58 శాతంతో రూ.34.02 కోట్లు సాధించారు.

● తెనాలి మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ.7.65 కోట్లు కాగా 35.06 శాతంతో రూ.2.68 కోట్లు వసూలు చేసింది.

● పొన్నూరు మార్కెట్‌ కమిటీ రూ.8.38 కోట్లు కాగా, 32.66 శాతంతో రూ.2.74 కోట్లు.

● దుగ్గిరాల మార్కెట్‌ కమిటీ రూ.3.75 కోట్లకు 34.67 శాతంతో రూ.1.30 కోట్లు.

● తాడికొండ మార్కెట్‌ కమిటీ రూ.2.17 కోట్లకు కేవలం 3.27 శాతంతో రూ.7 లక్షలు.

● మంగళగిరి మార్కెట్‌ కమిటీ రూ.3.03 కోట్లకు 24.72 శాతంతో రూ.75 లక్షలు.

● ఫిరంగిపురం మార్కెట్‌ కమిటీ రూ.1.88 కోట్లకు 15.73 శాతంతో రూ.30 లక్షలు.

● ప్రత్తిపాడు మార్కెట్‌ కమిటీ రూ.4.45 కోట్లకు 28.41 శాతంతో రూ.1.26 కోట్లు వసూలు చేశాయి.

ఫీజు వసూళ్లలో మందగమనం

జిల్లాలోని ఎనిమిది మార్కెట్‌ కమిటీల్లో

రాబడి అంతంత మాత్రం

ఈ ఏడాది లక్ష్యం రూ.146.31 కోట్లు..

ఆగస్టు చివరి నాటికి వసూలైంది రూ.43.12 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement