డాక్టర్‌ జున్ను మాస్టర్‌కు నేషనల్‌ టీచర్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ జున్ను మాస్టర్‌కు నేషనల్‌ టీచర్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

Sep 26 2025 6:22 AM | Updated on Sep 26 2025 6:22 AM

 డాక్టర్‌ జున్ను మాస్టర్‌కు నేషనల్‌ టీచర్స్‌ ఎక్స్‌లెన్

డాక్టర్‌ జున్ను మాస్టర్‌కు నేషనల్‌ టీచర్స్‌ ఎక్స్‌లెన్

డాక్టర్‌ జున్ను మాస్టర్‌కు నేషనల్‌ టీచర్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

చేతిరాతలో ఉచిత శిక్షణ అందిస్తున్నందుకు గుర్తింపు ఒకే నెలలో జిల్లా నుంచి జాతీయస్థాయి వరకు మూడు అవార్డులు

యడ్లపాడు: విద్యార్థులకు చేతిరాతలో ఉచిత శిక్షణ ఇస్తూ తనదైన శైలిలో గుర్తింపు పొందిన కొండవీడు జెడ్పీ హైస్కూల్‌ ఎస్జీటీ ఉపాధ్యాయుడు డాక్టర్‌ షేక్‌ జున్నుసాహెబ్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. శారద ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో బిర్లా ప్లానెటోరియం వద్ద ఉన్న భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు నేషనల్‌ టీచర్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు–2025ను ప్రదానం చేశారు.

ఒకే నెలలో మూడు అవార్డులు

విద్యారంగానికి జున్ను సాహెబ్‌ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ నెలలో ఇది మూడో అవార్డు రావడం విశేషం. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆయనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈనెల 7న విశాఖపట్నంకు చెందిన సెయింట్‌ మదర్‌థెరిసా సోషల్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ నుంచి గురుబ్రహ్మ రాష్ట్రస్థాయి అవార్డు, తాజాగా జాతీయస్థాయి అవార్డు తెలంగాణ రాష్ట్రంలో అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement