వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన పీఆర్కే | - | Sakshi
Sakshi News home page

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన పీఆర్కే

Sep 25 2025 7:37 AM | Updated on Sep 25 2025 1:50 PM

మాచర్ల: వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) మర్యాదపూర్వకంగా కలిశారు. మాచర్ల నియోజకవర్గంలో కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసులు, ప్రజలు భయంతో గ్రామాలు వదిలి వెళ్లిపోతున్న విషయాన్ని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు.

గాయత్రీ దేవిగా బాలచాముండేశ్వరి

అమరావతి: ప్రముఖ శైవక్షేత్రం అమరావతి బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్య్రుత్సవాలలో భాగంగా బుధవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. దసరా వేడుకలలో మూడో రోజు సహస్ర కుంకుమార్చన, దేవిఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీ చక్రార్చనతోపాటుగా గాయత్రీదేవికి సంధ్యా సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలలో పూజలలో పాల్గొన్నారు.

జిల్లా మత్స్యశాఖ అధికారిగా వెంకట్రావు

నరసరావుపేటరూరల్‌: జిల్లా మత్స్యశాఖ అధికారిగా ఐ.వెంకట్రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకట్రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. గతంలో మత్స్యశాఖ జిల్లా అధికారిగా పనిచేసిన సంజీవరావుపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ ఈనెల 11వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుత కలెక్టర్‌ కృతికా శుక్లా ఆదేశాల మేరకు వెంకట్రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు.

శింగరకొండ ఆలయ పాలక మండలి నియామకం

అద్దంకి రూరల్‌: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాల మండలిని నియమించారు. అధ్యక్షుడుగా చుండూరి మురళీ సుధాకరరావుతో పాటు సభ్యులుగా ఆకుల కోటేశ్వరరావు, బత్తుల చంద్రశేఖర్‌, నూతి లక్ష్మీ ప్రసాద్‌, మందా సునీత, ఏల్చూరి వెంకట నారాయణమ్మ, ధూళిపాళ్ల వెంకటరత్నం, గొర్రెపాటి పద్మజ, హరబోలు నాగమ్మ, దేవరపల్లి సురేష్‌బాబు, కొనంకి సుబ్బారావు నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement