సచివాలయ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగుల నిరసన

Sep 7 2025 7:46 AM | Updated on Sep 7 2025 7:46 AM

సచివాలయ ఉద్యోగుల నిరసన

సచివాలయ ఉద్యోగుల నిరసన

సత్తెనపల్లి: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సమస్యకు కారణమవుతున్న వలంటీర్‌ విధులను బహిష్కరిస్తూ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బైఠాయించి శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షుడు చిలుక ప్రదీప్‌ మాట్లాడుతూ గతంలో వలంటీర్లను క్లస్టర్లుగా విభజించి వారి సేవలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం వలంటీర్‌ వ్యవస్థ లేనందున ఆ సేవలను సచివాలయ ఉద్యోగుల చేత చేయించటం సరైనది కాదన్నారు. వలంటీర్ల విధులను తామెందుకు నిర్వహించాలని, తక్షణమే ఆ సేవలను సచివాలయ ఉద్యోగులకు కేటాయించటం మానుకోవాలన్నారు. ఈ సందర్భంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం సెక్రటరీ గౌతమి, మహిళా పోలీసులు జిల్లా ప్రెసిడెంట్‌ దామర్ల నలిని, తిరుమల లక్ష్మి గౌరవ సలహాదారుడు జి. రవిరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బూరే సైదా, జిల్లా అధ్యక్షుడు బి. కొండలరావు, సచివాలయాల ఉద్యోగులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement