ముగిసిన రొజ్జో ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రొజ్జో ఉత్సవాలు

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో చివరి రోజైన మంగళవారం రొజ్జో ఉత్సవాలను జిల్లాకు చెందిన ఓ జంట ఆఔమా గురుకులంలో విద్యార్థులతో కలిసితో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా రత్నకర్‌ దాస్‌ జంట తమ వివాహ వార్షికోత్సవాన్ని పిల్లలతో జరుపుకున్నారు. రొజో చివరి రోజు ఇక్కడ పిల్లలకు స్వీట్స్‌ ఇచ్చి ఊయలు ఊగి వారితో కలిసి ఉత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఇక్కడ నివసిస్తున్న పిల్లలు అనాథులు. అందుచేత ఈ జంట తమ ఇంట ఏటువంటి చిన్న పండగ జరిగిన వేడుక జరిగిన ఇక్కడ పిల్లలతో జరుపుకుంటారు. అలాగే రత్నకర్‌ దాస్‌ ఆయన భార్య సుచిత్ర దాస్‌ల 36వ వివాహ మహోత్సవాన్ని కూడా పిల్లలతో ఆనందంగా జరుపుకున్నారు. ఆఔమా గురుకులం స్థాపికుడు వినస్‌ మిశ్రో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement