● కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఇటీవల ముగిసిన రాజ్యసభ ఎన్నికలు పలు సంచలనాత్మక రాజకీయ పరిణామాలకు ఆజ్యం పోస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంమంది సభ్యులు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. దీంతో వారిపై చర్యలకు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నడుం బిగించింది. ఈ దిశలో ఇద్దరు ఎమ్మెల్యేల పదవుల రద్దు కోరుతు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర శాసనసభ స్పీకర్కు లిఖిత పూర్వకంగా అభ్యర్థించింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ డాక్టర్ సి.ఎస్.రాజెన్ ఎక్కా స్పీకర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ పిటిషనులో సభ్యుల పదవుల రద్దుకు సంబంధించిన బలమైన ఆధారాలు, కారణాలు వివరించారు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) కింద సోఫియా ఫిర్దౌస్ (బారాబటి కటక్), దాశరథి గొమాంగో (మోహన)లను అనర్హులుగా ప్రకటించాలని వినతులో పేర్కొన్నారు.


