జయపురం: జయపురం పారాబెడలో దండ జాతర నిర్వహణ కోసం సన్నాహక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఏప్రిల్ 12వ తేదీ దండ జాతర నిర్వహించేందుకు సమావేశం నిర్ణయించింది. పారాబెడ ఝంఖరదెయి మందిరం ప్రాంగణంలో కాళీమాతకు 12వ తేదీ రాత్రి పూజలు జరపాలని సమావేశం నిర్ణయించింది. ఆ రాత్రి పారాబెడ కూడలి ప్రాంతంలో అపేరాతో పటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో శివ ప్రసాద్ పందా, దృభచరణ మహంతి, హరి బోరడ, పంచానన నాయక్, శివ ప్రసాద్ తియాడి, జి.సూర్యనారాయణ పాత్రో, జగబందు పండా, ఆర్.బినోద్ రెడ్డి, రాజేంద్ర పాణిగ్రహి, పవిత్ర కుమార్ నాయక్, లక్ష్మీనారాయణ పాడీ, రామప్రసాద్ పాడీ, రాజేంద్ర కుమార్ గౌడ, తదితరులు పాల్గొన్నారు.


