75 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

75 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

Sep 18 2025 7:47 AM | Updated on Sep 18 2025 7:47 AM

75 లక

75 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

భువనేశ్వర్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు పురస్కరించుకుని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన కానుకగా ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. ఈ సందర్భంగా స్థానిక ఏకామ్ర కళాశాల ప్రాంగణంలో ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. పుడమి తల్లి పరిరక్షణకు కృతజ్ఞతపూర్వకంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలనే ప్రధాని పిలుపునకు స్పందిద్దామని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యాచరణ ప్రధాని మోదీకి అమూల్యమైన జన్మదిన కానుకగా నిలుస్తుందన్నారు. అనంతరం పార్టీ సీనియర్‌ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రక్తదానం మానవాళికి ఉత్తమ సేవగా పేర్కొన్నారు.

75 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం 1
1/2

75 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

75 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం 2
2/2

75 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement