నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం | - | Sakshi
Sakshi News home page

నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం

Sep 18 2025 7:47 AM | Updated on Sep 18 2025 12:27 PM

Minister Nityananda Gond at a blood donation camp

రక్తదాన శిబిరంలో మంత్రి నిత్యానంద గోండ్‌

పర్లాకిమిడి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక బిజూ పట్నాయక్‌ కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం రక్తదాన శిబిరాన్ని బీజేపీ అధ్యక్షులు నవకిశోరో శోబోరో, మాజీ ఎమ్మెల్యే కోడూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, విద్య, గణశిక్షా మంత్రి నిత్యానంద గోండ్‌ ముఖ్యఅతిథిగా శిబిరాన్ని ప్రారంభించారు. 

ఎక్సైజ్ సూపరింటెండెంటు, బీజేపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మొత్తం 52 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు బ్లడ్‌బ్యాంక్‌ అధికారులు తెలియజేశారు. సీడీఎంవో డాక్టర్‌ మహ్మద్‌ ముబారక్‌ ఆలీ, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు, జిల్లాపరిషత్‌ మాజీ చైర్మన్‌ పొట్నూరు లత, కౌన్సిలర్లు బబునా బెహారా, బాలక్రిష్ణ పాత్రో, నృసింహాచరణ్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement