మొక్కలు పర్యావరణాన్ని రక్షిస్తే, అది మనల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం బాధ్యతగా గుర్తించాలి. నేను పదేళ్లుగా మొక్కలు పంపిణీ చేస్తున్నా. వర్షాకాలం ప్రారంభంలో తమ ఆస్పత్రికి వచ్చే ప్రతిరోగికి ఒక పండ్ల మొక్కను అందజేస్తా. అంతేకాదు గ్రామాలు, కాలనీల్లో మొక్కలు పెంచేందుకు ఉచితంగా అందజేస్తున్నా. పర్యావరణం బాగుంటేనే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిస్తాం.
– డాక్టర్ కె. వేణుగోపాలరెడ్డి,
మధుమేహ నిపుణులు


