మహిమాన్వితం.. సుభాష్‌నగర్‌ శ్రీ రామాలయం | - | Sakshi
Sakshi News home page

మహిమాన్వితం.. సుభాష్‌నగర్‌ శ్రీ రామాలయం

Mar 24 2026 8:45 AM | Updated on Mar 24 2026 8:45 AM

జిల్లాలో ప్రాముఖ్యత గల దేవాలయం

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

27న కల్యాణం, 28న రథోత్సవం

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తోంది నగరంలోని సుభాష్‌నగర్‌ శ్రీరామాలయం. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ సమేతుడై భక్తులకు దర్శనమిస్తారు. నిత్య పూజలు, ప్రత్యేక హోమాలు, అభిషేకాలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ప్రధానంగా శ్రీరామనవమి వేడుకలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి రామాలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు జరిగే విశేష పూజలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌ సరళామహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోభానవీన్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

ఉత్సవ కార్యక్రమాలు ఇలా..

24 మంగళవారం ఉదయం 7 గంటలకు నిత్యారాధన, ధృవమూర్తులకు స్నపన తిరుమంజనం, పంచామృతాభిషేకం, సాయంత్రం 5 గంటలకు నిత్యారాధన, విష్ణు సహస్రనామ పారాయణం, అఖండ దీపారాధన తదితర పూజలు నిర్వహిస్తారు. 25 బుధవారం ఉదయం 7 గంటలకు నిత్యారాధన, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, వాస్తు, సోమ, సుదర్శన, కుంభస్థాపన, అగ్నిప్రతిష్ట, వాస్తు హోమం, గరుడ ప్రతిష్ట, ధ్వజారోహణం(గరుడ వివాహము) బలిహరణం ఉంటుంది. 26 గురువారం 7 గంటలకు నిత్యారాధన, అవాహిత దేవతాపూజ, నిత్యహోమములు, సాయంత్రం 5 గంటలకు నిత్యాహోమం, పారాయణములు, మూల మంత్ర హోమం, ఆరగింపు, బలిహరణం, మంగళాశాసన తీర్థగోష్టి, ఉలుకపూజ(కొట్నం పుణ్యాహవాచనం) నిర్వహిస్తారు. 27న ఉదయం 7 గంటలకు నిత్యారాధన, అవాహిత దేవతాపూజ, నిత్యహోమం, పారాయణములు, 9 గంటలకు ఎదుర్కోలు, శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం నిత్యారాధన, నిత్యహోమం విశేష పూజలు ఉంటాయి. 28న ఉదయం 7 గంటలకు నిత్య పూజలతోపాటు సాయంత్రం రథోత్సవం ఉంటుంది. 29న దోపు ఉత్సవం, చక్రతీర్థం, గరుఢధ్వజ అవరోహణం, ఏకాంతసేవ, 30న స్వామివారికి మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement