వరద గేట్ల మూసివేత | - | Sakshi
Sakshi News home page

వరద గేట్ల మూసివేత

Oct 17 2025 6:42 AM | Updated on Oct 17 2025 6:42 AM

వరద గేట్ల మూసివేత

వరద గేట్ల మూసివేత

బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ వరద గేట్లను అధికారులు మూసివేశారు. రెండ్రోజుల నుంచి ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గుతూ, పెరుగుతూ ఉండటంతో గోదావరిలోకి నీటి విడుదలను పెంచుతూ.. తగ్గించారు. గురువారం ఉదయం వరద మరింత తగ్గడంతో గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 9,654 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ వ్వారా 5 వేలు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 3 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, ఆవిరి రూపంలో 573, మిషన్‌ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు.

ఎస్సారెస్పీలోకి తగ్గిన ఇన్‌ఫ్లో

గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల

మూసి ఉన్న ఎస్సారెస్పీ వరద గేట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement