ప్రభుత్వం తొమ్మిదేళ్ల క్రితం అద్దె నిర్ణయించింది. అదే ఇప్పటి వరకు కొనసాగుతోంది. డీజిల్, పెట్రోలు ధరలు నిత్యావసరాలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చే అద్దె సరిపోవడం లేదు. అద్దె పెంచితేనే గిట్టుబాటు అవుతుంది.
– రాజశేఖర్, అద్దె వాహన యజమాని
వాహనాల అద్దె పెంచాలి
2023 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అద్దె వాహనాలను కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఉత్తర్వులు వస్తేనే పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామంటున్నారు. ప్రభుత్వం మా బాధలు అర్థం చేసుకుని వాహనాల అద్దె పెంచాలి.
– మహిపాల్, అద్దె వాహన యజమాని


