వడ్లపై మక్కల ప్రభావం
వరి ధాన్యం కొనుగోళ్లపై ఈసారి మొక్కజొన్న ప్రభావం పడుతోంది. ప్రైవేట్ మార్కెట్తో పోలిస్తే మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమిచ్చే ధర అధికంగా ఉంది. క్వింటాల్కు మార్కెట్లో రూ.1,800 వరకు వస్తుండగా, ప్రభుత్వం రూ.2,475పైనే చెల్లిస్తోంది. దాదాపు రూ.600 అధికంగా వస్తుండటంతో రైతులు ప్రైవేట్ వైపు చూడటం లేదు. ఇక్కడ కొనుగోలు పరిమితి దాటితేనే ఆ వైపు వెళ్తున్నారు. వరి ధాన్యం కంటే ముందు ధర ఎక్కువగా ఉన్న మక్కలు అమ్ముకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. సంచికి రూ.30–40 అదనంగా ఇస్తూ లారీని తామే తీసుకువచ్చి మక్కలు తరలిస్తున్నారు. చాలాచోట్ల మార్క్ఫెడ్ సంచులూ ఇవ్వకపోవడంతో రైతులే ఒక్కో సంచిని రూ.35పెట్టి మరీ కొనుక్కున్నారు.


