2016 అక్టోబర్ 12 విజయదశమి రోజున నిర్మల్ ప్రాంతం 19మండలాలతో కొత్త జిల్లాగా ఏర్పడింది.
స్వరాష్ట్రంలో నిర్మల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పదేళ్లపాటు రాష్ట్ర మంత్రిగా కొనసాగారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాకు దక్కిన అతిపెద్ద బహుమతి నిర్మల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు. 2022 ఆగస్టు 9న వైద్య కళాశాలను మంజూరు చేశారు.
వైద్యరంగంలో గతంలో ఊహించని విధంగా ఐసీయూ, డయాలసిస్, డయాగ్నోస్టిక్సెంటర్లు వచ్చాయి.
ౖఇప్పటికీ జిల్లా పారిశ్రామికంగా, విద్యపరంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. రైల్వేలైన్, ఇంజినీరింగ్ కాలేజీ, నవోదయ విద్యాలయం, పర్యాటకాభివృద్ధి ఇవన్నీ అందని ద్రాక్షలుగానే ఉన్నాయి.
నిర్మల్: ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ...’ పన్నేండేళ్ల క్రితం మార్మోగిన జననినాదం. ఎటు చూసినా.. ఎక్కడ విన్నా.. ఇదే మంత్రం. ఉవ్వెత్తున సాగి న స్వరాష్ట్ర సాధనోద్యమంలో నిర్మల్గడ్డ సైతం భా గమైంది. చిన్న నుంచి పెద్దదాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. సబ్బండ వర్గాలు, సమస్త ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలన్నీ ముందుకు వచ్చాయి. పార్టీలకతీతంగా జెండాలు, అజెండాలు పక్కన పెట్టి నా యకులంతా పోరుబాటలో నడిచారు. చారిత్రక నేపథ్యం ఉన్న పోరుగడ్డ నిర్మల్ ప్రాంతం సైతం స్వరాష్ట్ర ఉద్యమంలో కీలకంగా నిలిచింది. ఉద్యమంలో జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక భైంసా నుంచే ముగ్గురు యువకులు తమ ప్రాణాలను అర్పించడం మర్చిపోలేం. ప్రాణత్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణకు నేటితో 12 ఏండ్లు నిండాయి. ఈ పుష్కరకాలంలో జిల్లాగా మారిన నిర్మల్ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి.
‘పోరు’లో ప్రతీ ఊరు..
● అప్పటి లక్ష్మణచాంద(ప్రస్తుత సోన్) మండలంలోని బొప్పారం గ్రామస్తులు అఖండ తెలంగాణ జ్యోతిని వెలిగించారు. స్వరాష్ట్రం సాధించే వరకూ ఆ జ్యోతి ఆరకుండా ఉద్యమస్ఫూర్తిని రగిలించారు.
పుష్కరంలో మార్పులెన్నో..
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత.. నిర్మల్ ప్రాంత పరిస్థితులూ మారాయి.


