గత పన్నెండేళ్లలో ఎన్నో మార్పులు
పెరుగుతున్న జీడీడీపీ, తలసరి ఆదాయం
ఉమ్మడి రాష్ట్రంలో కన్నా స్వరాష్ట్రంలో మెరుగు
నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు అవుతోంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు జరిగింది. ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీ లు ఏర్పాటయ్యాయి. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల్లో వృద్ధి మొదలైంది. ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువైంది. జిల్లా స్థూల జాతీయోత్పత్తి, జిల్లా పౌరుల తలసరి ఆదాయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్థికంగా మరింత మెరుగు కనిపిస్తోంది. నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.


