గజ కోలాహలం
మైసూరు: కరోనా ఆంక్షల మధ్య ఈదఫా కూడా ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు 8 గజరాజులను గురువారం మైసూరుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఊరేగింపుగా ప్యాలెస్ ఆవరణలోకి ప్రవేశించాయి. ముఖ్య గజం అభిమన్యు, అలాగే విక్రమ, గోపాలస్వామి, ధనుంజయ, కావేరి, చైత్ర, లక్షి్మ, అశ్వత్థామ పేర్లుగల ఏనుగులు వచ్చాయి. అక్టోబరు 7న దసరా ఉత్సవాలు ఆరంభమవుతాయి. 15వ తేదీన ముఖ్య ఘట్టమైన జంబూ సవారీ ఊరేగింపు సాగుతుంది.