మరీ ఇలా ఉన్నావేంట్రా.. పనిమనిషిపై అత్యాచారం! | Shocking incident in karnataka | Sakshi
Sakshi News home page

మరీ ఇలా ఉన్నావేంట్రా.. ఇంటి పనిమనిషిపై అత్యాచారం..!

Sep 20 2025 12:22 PM | Updated on Sep 20 2025 2:03 PM

Shocking incident in karnataka

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

కర్ణాటక: మొబైల్ ఫోన్, అందులో లభ్యమయ్యే చెత్త కంటెంట్ బాలలను పెడదోవ పట్టిస్తోంది. అలాంటిదే ఈ సంఘటన. మైనర్ బాలుడు ఒకరు తమ ఇంటిలో పనిచేసే మహిళపై లైంగికదాడికి పాల్పడి అత్యంత పాశవికంగా హత మార్చాడు. ఈ దారుణ ఘ‌ట‌న హాసన్ జిల్లాలో అరసికెరె తాలూకా జవగళ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందూరు గ్రామంలో జరిగింది.

నిర్మానుష్య ప్రదేశంలో..
గ్రామస్తులు, పోలీసులు తెలిపిన మేరకు.. మహిళ (43) ఓ రైతు ఇంట్లో పనిచేస్తోంది. అదే ఇంట్లో రైతు బంధువైన 17 ఏళ్లు బాలుడు ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు గతంలో చనిపోగా రైతు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గత సోమవారం ఉదయం ఆమెతో బియ్యం కొనాలని దూరంగా ఉండే అంగడికి నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో బాలుడు కూడా ఆమె వెంట వెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో అతడు ఆమెను ఓ పొలంలోకి లాక్కువెళ్లి అత్యాచారం చేశాడు. ఆ విషయం అందరికీ చెబుతుంద‌నే భ‌యంతో బండరాయితో తలపై కొట్టి, ఆపై చెట్టు కొమ్మతో చితకబాది చంపేసి, ఆమె మొబైల్ ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. 

మరుసటి రోజు వరకు తల్లి కనబడకపోవడంతో ఆమె కొడుకు దినేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలించగా పొలంలో మృతదేహం కనిపించింది. మైనర్ కావడంతో మొదట బాలునిపై ఎలాంటి అనుమానం రాలేదు. దినేశ్ ఫిర్యాదుతో అతనిని తమదైనశైలిలో విచారణ చేయగా తప్పు ఒప్పుకున్నాడు. హంతకున్ని అరెస్ట్ చేశారు. హత్యపై లోతుగా విచారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహమ్మద్ సుజీత తెలిపారు. ఈ సంఘటన గ్రామంలో భయాందోళన కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement