సాక్షి,చెన్నై: కోయంబేడులో శనివారం అర్ధరాత్రి దాటి న తర్వాత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ స్టార్ హోటల్ పబ్లో మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తూ మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. గంజాయి, మద్యం మత్తు లో ఉన్న ఒక ముఠా.. కక్షపూరితంగా బైక్ను కారుతో ఢీకొట్టడంతో ప్లస్–2 చదువు పూర్తి చేసిన శ్రీలంక త మిళ శరణార్థి శిబిరం యువతి అక్కడికక్కడే మరణించింది.
ఈ ఘోర ఘటనలో మరో 17 ఏళ్ల బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. విల్లుపురం జిల్లా అనిచన్ కుప్పంలోని శ్రీలంక తమిళ పునరావాస శిబి రానికి చెందిన యాన్సీ(18) ఇటీవల ప్లస్–2 పరీక్షల్లో 450 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె ఉన్నత చదువుల కోసం అలగప్ప విశ్వవిద్యాలయానికి దరఖా స్తు చేసుకుంది. ఈ క్రమంలో చెన్నై రామపురంలో నివసిస్తున్న తన స్నేహితురాలిని (17 ఏళ్ల బాలిక) కలవడానికి యాన్సీ కొద్దిరోజుల క్రితం చెన్నైకి వచ్చింది.
శనివారం రాత్రి యాన్సీ, ఆమె స్నేహితురాలు తబిత (18) అనే మరో యువతితో పాటూ యువకులు కలిసి మొత్తం ఆరుగురు మూడు మోటారు సైకిళ్లపై కోయంబేడు ఫ్లైఓవర్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్ పబ్కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత యాన్సీ బృందం నృత్యం చేస్తున్న సమయంలో అక్క డ మద్యం మత్తులో ఉన్న మరో వర్గానికి చెందిన యు వకులతో వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పబ్ లో గందరగోళం నెలకొంది. హో టల్ బౌన్సర్లు ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి బయటకు గెంటేశారు. బయటకు వచ్చినా మరోసారి గొడవ పడ్డారు. తర్వాత ఇళ్లకు బయలుదేరారు.
కారుతో తొక్కించి హత్య
గొడవతో తీవ్ర ఆగ్రహానికి గురైన కారు డ్రైవర్ సుమన్ శక్తివేల్ (20) బైక్పై ప్రయాణిస్తున్న యువతులను చంపాలనే ఉద్దేశంతో కారును మెరుపు వేగంతో వారి బైక్ వైపు పోనిచ్చి బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న యాన్సీ, వెనుక కూర్చున్న 17 ఏళ్ల బాలిక గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయమై, ముఖం పూర్తిగా చిద్రమైన స్థితిలో యాన్సీ (18) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలైన బాలికను కోయంబేడు కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నిరుపేద కూలీ అయిన యాన్సీ తండ్రి నకులేశ్వరన్ , కుటుంబ సభ్యులు ఈ వార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు.


