నాగర్కోయిల్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్: ఉభయ తెలుగు రాష్ట్రాలు(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) తమిళనాడు, మధ్య కనెక్టివిటీనీ పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త నాగర్కోయిల్-చర్లపల్లి మధ్య అమృత్ భారత్ రైలును ప్రారంభించనుంది. ఇది దిగువ, దిగువ-మధ్యతరగతి ఆదాయ వర్గాల ప్రయాణీకులకు సరసమైన , అధిక-నాణ్యత సేవను అందించనుందని రైల్వే శాఖ ప్రకటించింది.
నాగర్కోయిల్-చర్లపల్లి అమృత్ భారత్ రైలు: చర్లపల్లి అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య స్లీపర్,జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు 2026 మార్చి 13న కామాఖ్య నుండి మొదలువుతుంది. ఈ రైలు తిరునెల్వేలి, కోవిల్పట్టి, నెల్లూరు తదితర మార్గాల్లో ఏడు సోదర రాష్ట్రాలకు ప్రవేశద్వారంగా పనిచేస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల వైపు ప్రయాణించే సుదూర ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన , ఖర్చుతో కూడుకున్న ప్రయాణాన్ని కలిగి ఉండటానికి ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
తెలుగులో రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఆగుతుంది
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గూండా సాగే ఈ ప్రయాణంలో, ఈ రైలు శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట్ జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు , నల్గొండ స్టేషన్లలో రెండు ప్రయాణాల్లోనూ ఆగుతుంది.


