
న్యూఢిల్లీ: హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే శ్రావణ సోమవారం నేడు. దీంతో దేశమంతటా శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. భక్తులు మహాశివునికి మనసారా అభిషేకాలు చేస్తున్నారు.
#WATCH | Varanasi, UP | Mangal Aarti being performed at Kashi Vishwanath Temple during the holy month of Shraavan.
(Source: Kashi Vishwanath Mandir) pic.twitter.com/jqD5wN4pHS— ANI (@ANI) July 28, 2025
వారణాసిలోని విశ్వనాథుని ఆలయంలో మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంగళ హారతిలో పాల్గొనేందుకు పొడవైన క్యూలలో నిలుచున్నారు. అధికారులు ఆలయానికి వచ్చిన భక్తులపై పుష్పవర్షం కురిపించి, పండుగ వాతావరణాన్ని రెండింతలు చేశారు.
అహ్మదాబాద్లోని కోటేశ్వర్ మహాదేవ్ ఆలయంలో గుజరాత్ సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు జరుగుతున్నాయి. ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా ఉంది.
#WATCH | Delhi | Devotees in huge numbers reach Chandni Chowk's Gauri Shankar Temple on the third Monday of Shraavan pic.twitter.com/ld5VCXjooM
— ANI (@ANI) July 28, 2025
ఢిల్లీలోని గౌరీ శంకర్ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. చాందిని చౌక్ నడిబొడ్డున ఉన్న ఈ చారిత్రాత్మక ఆలయంలోని పరమేశ్వరుణ్ణి చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు దీపాలు వెలిగిస్తూ, తమ భక్తిని చాటుకుంటున్నారు.
#WATCH | Delhi | Devotees in huge numbers reach Chandni Chowk's Gauri Shankar Temple on the third Monday of Shraavan pic.twitter.com/ld5VCXjooM
— ANI (@ANI) July 28, 2025
ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మధ్యప్రదేశ్లోని ఈ ఆలయంలో నిర్వహించే మంగళ హారతి, దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
#WATCH | Delhi | Devotees in huge numbers reach Chandni Chowk's Gauri Shankar Temple on the third Monday of Shraavan pic.twitter.com/ld5VCXjooM
— ANI (@ANI) July 28, 2025
రాజస్థాన్లోని తారకేశ్వర్ మహాదేవ్ ఆలయం ఈ ప్రాంతంలోని ముఖ్యమైన తీర్థయాత్రా స్థలంగా పేరొందింది. వేలాది మంది శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయానికి తరలి వస్తున్నారు.
#WATCH | Delhi | Devotees in huge numbers reach Chandni Chowk's Gauri Shankar Temple on the third Monday of Shraavan pic.twitter.com/ld5VCXjooM
— ANI (@ANI) July 28, 2025
హరిద్వార్లోని దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం భక్తులతో కిటలాడుతోంది. గంగానది ఒడ్డున ఉన్న ఈ ఆలయం భక్తులకు కొంగుబంగారంగా నిలిచింది.