జూబ్లీహిల్స్‌తో పాటు ఇక్కడా.. జోరుగా కౌంటింగ్‌ | Big Counting Day, Counting Has Begun For Bihar And 8 Key Assembly Constituencies, More Details Inside | Sakshi
Sakshi News home page

Big Counting Today: జూబ్లీహిల్స్‌తో పాటు ఇక్కడా.. జోరుగా కౌంటింగ్‌

Nov 14 2025 8:37 AM | Updated on Nov 14 2025 10:24 AM

Counting has begun across 8 assembly constituencies

న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో ఈరోజు (శుక్రవారం, నవంబర్‌ 14) ఒక ప్రత్యేకమైన దినం. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు  వెలువడనున్నాయి. దీనితోపాటు ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఎనిమిది కీలక అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు కూడా నేడు వెల్లడికానున్నాయి. ఉప ఎన్నికలు జరిగిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమయ్యింది.

తెలంగాణ: జూబ్లీహిల్స్
తెలంగాణలోని జూబ్లీహిల్స్ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌ నేత నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్‌ మహిళా నేత సునీత మధ్య గట్టి పోటీ ఉండనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. లంకల దీపక్ రెడ్డిని బీజేపీ ఎన్నికల బరిలోకి దింపింది.

జమ్ముకశ్మీర్: బుడ్గామ్, నగ్రోటా
బుడ్గామ్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అభ్యర్థి అఘా మెహమూద్‌తో పీడీపీ  నేత అగా సయ్యద్ ముంతాజీర్ తలపడ్డారు. ఒమర్ అబ్దుల్లా తన గండేర్‌బాల్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకుని, బుడ్గామ్ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఎన్నిక అనివార్యమయ్యింది. నగ్రోటాలో బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ ఎన్‌సీ నుంచి షమీమ్ బేగం, బీజేపీ నుంచి దేవయాని రాణి పోటీ చేస్తున్నారు.

రాజస్థాన్: అంట
రాజస్థాన్‌లోని అంట నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్ జైన్ భయా,  బీజేపీకి చెందిన మోర్పాల్ సుమన్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. బీజేపీకి చెందిన కన్వర్ లాల్ మీనా తన స్థానాన్ని కోల్పోయిన  దరిమిలా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

జార్ఖండ్: ఘట్‌శిల
జార్ఖండ్‌లోని ఘట్‌శిల ఉప ఎన్నిక  అందరి దృష్టిని ఆకర్షించింది.ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (బీజేపీ) కుమారుడు బాబులాల్ సోరెన్, మహాకూటమికి చెందిన సోమేష్ చంద్ర సోరెన్‌తో పోటీ పడుతున్నారు.

ఒడిశా: నువాపాడ
ఒడిశాలోని నువాపాడ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన జే ధోలాకియా, బీజేడీకి చెందిన స్నేహంగిని చురియా  కాంగ్రెస్‌కు చెందిన ఘసిరామ్ మాఝి మధ్య త్రిముఖ పోరు ఏర్పడింది.  స్థానిక కుల సమీకరణలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంటాయి.

పంజాబ్: తర్న్ తరన్
పంజాబ్‌లోని తర్న్ తరన్‌లో ఆప్ ఎమ్మెల్యే కాశ్మీర్ సింగ్ సోహల్ మృతితో ఉప ఎన్నిక జరిగింది. బీజేపీకి చెందిన హర్జీత్ సింగ్ సంధు, ఆప్‌కు చెందిన హర్మీత్ సింగ్ సంధు కాంగ్రెస్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ ఇక్కడ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.

మిజోరం: డంపా
షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన మిజోరంలోని డంపా నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. బీజేపీ లాల్హ్మింగ్తంగా సైలోను, కాంగ్రెస్ జాన్ రోట్లువాంగ్లియానాను నామినేట్ చేసింది. ఎంఎన్ఎఫ్ ఆర్. లాల్తాంగ్లియానాను ప్రతిపాదించింది. జెడ్‌పీఎంకు చెందిన వాన్లాల్‌సైలోవా ఈ రేసులో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement