దేశంలో కొత్తగా 24,010 కరోనా కేసులు

Coronavirus: 24,010 New Coronavirus Cases Registered In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 24,010 కరోనా వైరస్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో  మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 99,56,558కు చేరింది. అదే విధంగా  గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్‌తో 355 మంది మృతి చెందారు. ఈ మేరకు గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి  వివిధ ఆస్పత్రుల ద్వారా కోలుకొని డిశ్చార్జ్‌ అయిన వారి మొత్తం సంఖ్య 94,89,740గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కోవిడ్‌ మృతుల సంఖ్య 1,44,451కు చేరింది. ప్రస్తుతం దేశంలో దేశంలో 3,22,366 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తెలంగాణలో కొత్తగా 509 కరోనా కేసులు..
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గడిచిన 24 గంటల్లో కొత్తగా  509 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్త బయటపడ్డ కోవిడ్‌ పాజిట్‌ కేసుల సంఖ్య 2,79,644 కు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా నుంచి వివిధ ఆస్పత్రుల ద్వారా కోలుకొని డిశ్చార్జ్‌ అయిన వారి మొత్తం సంఖ్య 2,70,967గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1505 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 7,172 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top