గుప్త నిధి కోసం కన్నతల్లి బలి యత్నం..! | Chamarajanagar Nidhi Incident | Sakshi
Sakshi News home page

గుప్త నిధి కోసం కన్నతల్లి బలి యత్నం..!

May 2 2026 12:41 PM | Updated on May 2 2026 1:04 PM

Chamarajanagar Nidhi Incident

కర్ణాటక: ధనం కోసం  కన్న తల్లిని బలివ్వబోయిన  కర్కోటక తనయుడి ఉదంతం చామరాజనగర తాలూకా సగడే గ్రామంలో చోటు చేసుకుంది. మే 1వ తేదీన పౌర్ణమి రోజున ఒకరిని బలి ఇస్తే నిధి లభిస్తుందని  స్కెచ్‌ గీసిన కొండయ్యన మదశెట్టి తన 80 ఏళ్ల అంధ, చెవిటి తల్లి మదమ్మ శెట్టిని బలివ్వడానికి సిద్ధమయ్యాడు. ఈ ఉదయం అతను తన ఇంట్లో 4 అడుగుల గొయ్యి తవ్వకం, అందులో ఒక మంత్రకుండం ఉంచి, నిమ్మ, పసుపు, కుంకుమపువ్వు, కలశంతో పూజ చేశాడు. 

దీనిపై అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. చామరాజనగర రూరల్‌ స్టేషన్‌ పోలీసులు ఇంటికి చేరుకోగానే మంత్రగత్తె పారిపోయింది. దీంతో మదశెట్టిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నిధిని పొందడానికి ఉపయోగించిన మాయాజాలం గురించి తెలుసుకుని సగడే గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement