ఉద్యోగాల పేరిట రూ.25 కోట్లకు కుచ్చుటోపీ | Bengaluru Couple Arrested For Rs 25 Crore Court Job Fraud | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరిట రూ.25 కోట్లకు కుచ్చుటోపీ

Mar 24 2026 5:35 AM | Updated on Mar 24 2026 5:35 AM

Bengaluru Couple Arrested For Rs 25 Crore Court Job Fraud

బెంగళూరులో ఘరానా మోసం

యశవంతపుర: కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తా­మని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోస­గించే కిలాడీ దంపతులను బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెంగళూరుకు చెందిన జైసన్‌ డిసోజా, లవీనా దంపతులు నిరు­ద్యోగులు. వీరు ప్రైవేట్‌ సంస్థల్లో పని చేస్తున్న యువకులను గుర్తించి, కోర్టుల్లో గ్రూప్‌–డి ఉద్యోగాలను ఇప్పిస్తామని నమ్మించేవారు. నిరు­ద్యోగులను గుర్తించేందుకు ఏజెంట్లను కూ­డా నియమించుకున్నారు. ఒక్కో నిరు­ద్యో­గి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డబ్బు వసూలు చేశారు.

ఖరీదైన హోటల్స్‌లో ధ్రువపత్రాల తనిఖీ, ఇంటర్వ్యూలు అని నాటకాలు ఆడేవారు. నకిలీ నియామక పత్రాల­ను చేతిలో పెట్టేవా­రు. నకిలీ పత్రా­లు తీసుకుని కోర్టు­ల­కు వెళ్లినవారికి తా­ము మోసపోయామని అర్థమయ్యేసరికి, ఈ జంట ఫోన్‌లను స్విచాఫ్‌ చేసేది. చేసేది లేక బాధితులంతా బసవేశ్వరనగరతో పాటు నగరంలోని వివిధ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. 500 మంది నుంచి రూ.25 కోట్లు వసూలు చేసినట్లు తె­లి­సింది. 2024లో ఇదే ఫిర్యాదుపై అరెస్టయి కొ­న్నాళ్లు జైలులో ఉండి వచ్చిన ఈ దంపతులు, మళ్లీ అదే దందా కొనసాగిస్తున్నారని, కేసు విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement