మక్తల్: మండలంలోని జక్లేర్కు చెందిన కిషన్రావు, శ్రీనివాసరావు, ఉత్తం ఎంకప్ప రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రజాకార్లు గ్రామాల్లో సంపదను దోచుకెళ్లడంతో పాటు ఆడవాళ్లను చిత్రహింసలకు గురిచేస్తూ ఎన్నో అరాచకాలు చేసేవారు. వాటిని ఎదురించే తరుణంలో రజాకార్లు కిషన్రావు, శ్రీనివాసరావును బంధించి గుల్భర్గ జైలుకు పంపారు. 1947, ఆగస్టు నుంచి 1948, జూన్ వరకు సుమారు 11 నెలల పా టు జైల్లో పెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జైలు నుంచి విడుదల చేసి ఆదోని క్యాంపునకు తరలించారు. 1952 తర్వాత జక్లేర్ బస్టాండ్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం 3 రోజుల పాటు 5వ మహాసభలు నిర్వహించి జెండా ఎగురవేశారు.


