
మొరాయిస్తుంది..
మూడు నెలలకు సంబంధించి బియ్యం పంపిణీ ప్రక్రియ బాగానే ఉన్నా.. లబ్ధిదారుల వేలి ముద్రలను తీసుకునే సమయంలో ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి బియ్యం అందించడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. సర్వర్ ఇబ్బందులు లేకుంటే రోజుకు గత నెల మాదిరిగానే వంద మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది.
– తిరుపతిరెడ్డి, రేషన్ డీలర్, అప్పంపల్లి
లబ్ధిదారులు ఆందోళన చెందొద్దు
రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఒకే సారి పంపిణీ చేసే క్రమంలో ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు రావచ్చనే అలోచనతో ఈ నెల 30 వరకు బియ్యం పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేశాం. మొదట నాలుగు రోజులు మూడు సార్లు వేలిముద్రలు, ఆరు సార్లు తూకం వేసి బియ్యం పంపిణీ చేశారు. సమస్య జఠిలంగా మారడంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. 6వ తేదీ నుంచి మూడుసార్లు వేలి ముద్రలు, మూడు సార్లు బియ్యం తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసింది.
– సైదులు, పౌర సరఫరాల శాఖ అధికారి, నారాయణపేట
●