
మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ముదిరాజ్లు
నారాయణపేట: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సేవల మంత్రి వాకిటి శ్రీహరిని శుక్రవారం హైదరాబాద్లో నారాయణపేట జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో జిల్లా కేంద్రంలో మంత్రికి ముదిరాజ్ సన్మానసభను ఏర్పాటుచేసినట్లు విన్నవించారు. జిల్లాలోని ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం మంత్రిగా తాను పాటుపాడుతామని భరోసానిచ్చారు. రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. అదే విధంగా శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ను కలిశారు. మంత్రితో పాటు శాసనమండలి వైస్ చైర్మన్ను కలిసిన వారిలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు సరాఫ్ నాగరాజు, దామరగిద్ద పీఏసీఎస్ చైర్మన్ పుట్టి ఈదప్ప, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షులు ఎ.కాంతకుమార్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కోనంగేరి హన్మంతు, మరికల్ మత్స్యశాఖ అధ్యక్షులు కానుగంటి నారాయణలు ఉన్నారు.