
రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి
కోస్గి రూరల్: కోస్గి, గుండుమాల్ మండలాల పరిదిలో జరుగుతున్న అబివృద్ది పనుల్లో వేగం పెంచాలని , పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణంలో సంబంధిత కాంట్రాక్టర్లు నాణ్యత పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం కోస్గి, గుండుమాల్ మండల పరిదిలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుండుమాల్లోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవనం, బోగారంలోని పాఠశాల, బోగారం నుంచి అమ్లీకుంట వరకు రోడ్డు పనులను పరిశీలించారు. కోస్గి మండలంలోని కడంపల్లి నుంచి హన్మాన్పల్లి గ్రామాన్ని కలిపే బ్రిడ్జి పనులు, సర్జఖాన్పేట్లోని పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులతోపాటు మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలన్నారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అనంతరం పోతిరెడ్డిపల్లి నుండి సర్జఖాన్పేట్ , పోతిరెడ్డిపల్లి నుండి జిన్నారం వరకు రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈపిఆర్ శ్రీనివాస్రెడ్డి, ఈఈపీఆర్ హిర్యానాయక్ , ఎంపీడీఓ శ్రీధర్, పీఆర్ఏఈ అంజిరెడ్డి పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రి భద్రపరిచిన గదులను, సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అక్కడి భద్రతా సిబ్బందికి సూచించారు. కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ సంచిత్గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్ నాయక్, వివిధ రాజీకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్రెడ్డి, మనివర్ధన్, వెంకట్రామరెడ్డి, వెంకటయ్య, మహ్మద్ అబ్దుల్ తదితరులు ఉన్నారు.