కుందూకు వస్తున్న వరద ఉద్ధృతిని తట్టుకునేందుకు గతంలో కుందూనదికి ఇరువైపులా మట్టికట్టలు ఏర్పాటు చేశారు. చిన్నపాటి వరద కూడా పట్టణం మీదకు రాకుండా కట్టలు అడ్డుకొనేవి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత టీడీపీ నాయకుల కన్ను కుందూ మట్టికట్టలపై పడింది. మట్టి నాణ్యతగా ఉండటంతో పట్టణంలోని ఓ కార్యాలయం కోసం ఓ మంత్రి అనుచరులు తరలించారు. దాదాపు వందలాది ట్రాక్టర్ల మట్టిని తోలడంతో కుందూ కట్ట కోతకు గురైంది. ప్రస్తుతం చిన్నపాటి వరద వచ్చినా నీరు మొత్తం మున్సిపల్ కార్యాలయ ప్రాంతాన్ని చుట్టుముట్టే అవకాశం ఉంది.
పుసులూరు వద్ద టీడీపీ నేత డంప్ చేసిన ఇసుక


