మద్దతు ధర పొందాలి | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధర పొందాలి

Oct 11 2025 6:36 AM | Updated on Oct 11 2025 6:36 AM

మద్దతు ధర పొందాలి

మద్దతు ధర పొందాలి

రామగిరి(నల్లగొండ), నకిరేకల్‌: నాణ్యతాప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర క్వింటాకు రూ.2,389 పొందాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. శుక్రవారం ఆమె నల్లగొండ మండలం అర్జాలబావి, నకిరేకల్‌ మండలం తాటికల్‌లో పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తాలు, మట్టిపెడ్డలు లేకుండా ధాన్యాన్ని తేవాలన్నారు. ఆమె వెంట డీసీఓ పత్యానాయక్‌, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశం, నకిరేకల్‌ తహసీల్దార్‌ యాదగిరి, ఏడీఏ జానిమియా, పీఏసీఎస్‌ సీఈఓ జగన్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement