
ఉర్సుకు వేళాయే..
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా కేంద్రంలోని హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానుంది. కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఉర్సు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం స్థానిక మదీనా మసీదు నుంచి గంధం ఊరేగింపుతో ఉర్సు ప్రారంభమవుతుంది. 10న దీపాలంకరణ, 11న ఖవ్వాలిలో ఉర్సు మురుస్తుంది. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతోపాటు హైదరాబాద్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
ఫ మూడు రోజులు ఉత్సవాలు
ఫ నేడు గంధం ఊరేగింపు