
21,660 కేసులు పరిష్కారం
రామగిరి(నల్లగొండ): జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించి జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాజీమార్గమే రాజమార్గం అన్ని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసి 38 సివిల్, 15,837 క్రిమినలు, 85 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 28 బ్యాంకు కేసులు, 25 సైబర్ క్రైమ్ కేసులు, 80 ట్రాన్స్కో, 5,567 ట్రాఫిక్ చలాన్ కేసులతో కలిపి మొత్తం 21,660 (పెండింగ్, ప్రీ లిటిగేషన్) కేసులు పరిష్కరించామన్నారు. ప్రమాద బీమా కేసుల్లో బాధితులకు రూ.4,75,29,000 నష్టపరిహారం ఇప్పించగా రూ.30,21,000 బ్యాంకు కేసులలో రుణపరిహారం అందజేశారు. సైబర్ క్రైం కేసులో రికవరీ డబ్బులు రూ.2,03,112 అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి పి.పురుషోత్తమ్రావు, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మంద నగేష్, ఇతర న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన జడ్జి నాగరాజు
ఫ 12 ప్రత్యేక బెంచ్లలో లోక్అదాలత్

21,660 కేసులు పరిష్కారం