నల్లగొండ: నల్లగొండ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి.రామకృష్ణ తెలిపారు. శుక్రవారం రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడ్ గ్రామానికి చెందిన జమ్మిగుంపుల శ్రీకాంత్ అనే యువకుడు నల్లగొండ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. విచారించిన అనంతరం నిందితుడి వద్ద నుంచి 20 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్, రూ.4930 స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ రమణ, రైల్వే పోలీసులు పాల్గొన్నారు.
ఫ ఫోన్, బంగారం, నగదు స్వాధీనం