గుణాత్మక విద్య అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

గుణాత్మక విద్య అందిస్తాం

Jun 12 2025 3:31 AM | Updated on Jun 12 2025 3:31 AM

గుణాత

గుణాత్మక విద్య అందిస్తాం

ఉపాధ్యాయులకు వేసవిలో వృత్యంతర శిక్షణ పూర్తి చేశాం

ఈసారి అన్ని పాఠశాలల్లో ఏఐ బోధన

విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా బడిబాట నిర్వహిస్తున్నాం

విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల పరిధిలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతాం

‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈఓ భిక్షపతి

నల్లగొండ : ‘ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తాం. నూతన పద్ధతిలో సాంకేతికతతో కూడిన బోధన చేసే విధంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చాం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది నుంచి అన్ని స్కూళ్లలో ఏఐ బోధన ప్రారంభిస్తాం’ అని డీఈఓ భిక్షపతి అన్నారు. గురువారం పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

పాఠశాలలు పునః ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కేజీవీబీ, మోడల్‌ స్కూళ్లలో ఇప్పటికే శుద్ధీకరణ పనులు చేయించాం. శానిటేషన్‌తో పాటు మధ్యాహ్న భోజన వంట పాత్రలు శుభ్రం చేయించాం. బడి ఈడు పిల్లలందర్ని బడిలో చేర్పించే విధంగా జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. గతంలో కంటే ఈసారి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాం. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి పిల్లలు అధిక సంఖ్యలో చేరే విధంగా చర్యలు తీసుకుంటారు.

మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాం..

పాఠశాల తెరిచిన రోజునే విద్యార్థులకు యూనిఫామ్‌, పుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందజేస్తాం. పాఠశాలలు ప్రారంభమైన మొదటి పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తాం. మొదటి రోజున ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావాలి. తోరణాలు, బెలున్లతో పాఠశాలను అలంకరించుకుని గ్రామంలోని ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువతను ఆహ్వనించి సమావేశం నిర్వహించాలి. ఏ పాఠశాలోనైతే జీరో ఎన్‌రోల్‌మెంట్‌ ఉందో, తక్కువ విద్యార్థులు ఉన్నారో ఆ పాఠశాల పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తాం. ఎంఈఓలు, హెడ్మాస్టర్లు, సీఆర్‌పీలు ఆ పాఠశాలలను తిరిగి తెరిచే విధంగా చర్యలు తీసుకుంటారు.

13వ తేదీన సామూహిక అక్షరాబ్యాసం..

13వ తేదీన బాలసభ నిర్వహించి సామూహిక అక్షరాబ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాంస్క్రతిక కార్యక్రమాలతో పాటు విద్యపై అవగాహన, డ్రాయింగ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16వ తేదీన పాఠశాలలో లెర్నింగ్‌ ఇంప్రూమెంట్‌ నేర్పిస్తారు. అదే విధంగా ఫన్‌ స్టోరీలు నేర్పిస్తారు. 17వ తేదీన పాఠశాలల్లో గర్ల్స్‌ చైల్డ్‌ పంక్షన్‌ నిర్వహిస్తున్నాం. యాక్టివిటీ విధానంలో బోధన జరిగేలా ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఎన్‌రోల్‌మెంట్‌ ఎక్కువగా అయిన పాఠశాలల్లో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాం.

అన్ని పాఠశాలల్లో ఏఐ అమలు..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్‌ ఆమోదంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఏఐ పాఠాలు అమలు చేయబోతున్నాం. ఇది పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సంవత్సరం పదో తరగతి విద్యార్థుల తరహాలోనే ఈ సారి 6వ తరగతి నుంచే విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ అవర్‌ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సలహాలు, సూచనలతో రాష్ట్ర స్థాయిలో ఇచ్చే కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతాం.

గుణాత్మక విద్య అందిస్తాం1
1/1

గుణాత్మక విద్య అందిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement