
ఊరూరా.. అంగన్వాడీ బాట
మిర్యాలగూడ టౌన్ : రెండున్నరేళ్లు నిండిన పిల్లలను తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరుతూ ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంగన్వాడీల్లో పిల్ల పెంపే లక్ష్యంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈనెల 17వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ, సహయ కమిటీ బృందాలు పిల్లల నమోదును పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనముల, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు, కొండమల్లేపల్లి, నకిరేకల్ ప్రాజెక్టుల పరిధిలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ప్రత్యేక కార్యక్రమాలు ఇలా..
● అంగన్వాడీలు, ఎన్జీఓ సంఘాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోషణ్ అభియాన్ సిబ్బంది ర్యాలీల నిర్వహణ.
● పట్టణ, గ్రామీణ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం.
● పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను వివరించి వారిని ప్రోత్సహించడం.
● అంగన్వాడీ కేంద్రాల్లో చదువు పూర్తయిన పిల్లలకు సర్టిఫికెట్లు అందించి. వారు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించడం.
● స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమం పేరుతో కేంద్రాలను శుభ్రం చేయడం.
● అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో మొక్కలను నాటడం.
● సామూహిక అక్షరభ్యాసం నిర్వహించడం.
● పిల్లలకు పాఠాలు, టైం టెబుల్, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తదితర అంశాలపై అవగాహన కల్పించడం.
● స్టడి మెటీరియల్ను పంపిణీ చేయడం.
ఫ 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు
ఫ రెండున్నరేళ్లు దాటిన పిల్లలు అంగన్వాడీలో చేర్పించేలా ప్రణాళిక