
68,70,800 మొక్కలు నాటడమే లక్ష్యం
నల్లగొండ : వనమహోత్సవం కింద జిల్లాలో 68,70,800 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ వెల్లడించారు. వనమహోత్సవ కార్యక్రమంపూ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నాటనున్న 68,70,800 మొక్కల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు 39,51,700 వ్యవసాయ శాఖ 7,66,000, ఉద్యాన శాఖ 6,38,000, మున్సిపాలిటీలు 8,20,00 మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ వన మహోత్సవం కింద ఆయా శాఖలు వారికి నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించడమే కాకుండా, జియో ట్యాగింగ్ చేయాలని, నర్సరీలను మ్యాచింగ్, బ్యాచింగ్ చేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ ప్రతి పాఠశాలలో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జెడ్పీ ఇన్చార్జి సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, ఎకై ్సజ్ అధికారి సంతోష్, డీఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఫ స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్