
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
నార్కట్పల్లి : భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నార్కట్పల్లి మండలంలోని ఏపీ లింగోటం గ్రామంలో నిర్వహించిన రెవవెన్యూ సదస్సుకు ఆమె హాజరై రైతులతో మాట్లాడి.. భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలు రైతులు దరఖాస్తు చేసుకోవాలని, ఒకవేళ రెవెన్యూ సదస్సులకు హాజరు కాలేకపోతే ఈనెల 20వ తేదీ వరకు నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా చట్ట ప్రకారం వెసులుబాటు ఉంటే రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరావు, అధికారులు ఉన్నారు.