కాంగ్రెస్‌ కమిటీలో అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ కమిటీలో అగ్రస్థానం

Jun 10 2025 3:16 AM | Updated on Jun 10 2025 3:16 AM

కాంగ్రెస్‌ కమిటీలో అగ్రస్థానం

కాంగ్రెస్‌ కమిటీలో అగ్రస్థానం

ఉపాధ్యక్షులుగా ముగ్గురు

ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీలో నల్లగొండ జిల్లాకు అగ్రస్థానం దక్కింది. పార్టీ ఉపాధ్యక్ష పదవుల్లో ముగ్గురిని నియమించగా, ప్రధాన కార్యదర్శులు ఐదుగురికి స్థానం లభించింది. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్‌రెడ్డి, కొండేటి మల్లయ్య, గుమ్ముల మోహన్‌రెడ్డి నియమితులయ్యారు. కొండేటి మల్లయ్య ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గుమ్ముల మోహన్‌రెడ్డి నల్లగొండ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా బొజ్జ సంధ్యారెడ్డి, దైద రవీందర్‌, చనగాని దయాకర్‌, వి.రామారావుగౌడ్‌, చకిలం రాజేశ్వర్‌రావుకు అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే, ఇందులో గుమ్ముల మోహన్‌రెడ్డి, కొండేటి మల్లయ్య, చనగాని దయాకర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారే కావడం గమనార్హం. ఈ నియామకాలతో వారు డీసీసీ అధ్యక్ష పదవికి దూరం అయినట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

వినతుల స్వీకరణ

నల్లగొండ : గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ 35 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి.. చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించారు.

నేటి నుంచి ‘అమ్మ మాట –అంగన్‌వాడీ బాట’

నల్లగొండ : ‘అమ్మ మాట – అంగన్‌వాడీ బాట’ మంగళవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. మూడేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీ బడిలో చేర్పించే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. 10న అంగన్‌వాడీ కేంద్రాల అలంకరణ, తల్లిదండ్రులు పిల్లలతో సెల్ఫీ దిగడం, 11న ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల్ని అంగన్‌వాడీలో చేర్చకోవడం, 12వ తేదీ నుంచి 16 వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్‌ కిచెన్‌ గార్డెన్ల అభివృద్ధి, పౌష్టికాహార ప్రాముఖ్యత తెలియజేయడం, 17వ తేదీన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని పేర్కొన్నారు.

హాస్టల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ : ప్రభుత్వ వికలాంగుల బాలుర కళాశాల వసతి గృహంలో దివ్యాంగులు, అంధులు, బధిర విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ అధికారి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హత, తదితర వివరాల కోసం 9154759888 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

30వ తేదీ వరకు బియ్యం పంపిణీ

నల్లగొండ : జిల్లాలోని అన్ని రేషన్‌ దుకాణాల్లో జూన్‌, జూలై, ఆగస్టు (3 నెలలు)లకు సంబంధించిన సన్న బియాన్ని ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్‌ కార్డుదారులు సన్నబియ్యం పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ నెల 30 వరకు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

ఉపకరణాలకు దరఖాస్తులు

నల్లగొండ : శారీరక, బధిర, అంధ, మానసిక దివ్యాంగుల్లో అర్హులైన వారి నుంచి ఉపకరణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిఽశు వికలాంగుల సంక్షేమ అధికారి కృష్ణవేణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈ నెల 18 వరకు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ్టటౌ bmms. cgg.gov.inలో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత, తదితర వివరాలకు 9441032444 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement