
పది రోజుల్లో భవనాలకు నిధులు
మిర్యాలగూడ : మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచనల మేరకు పది రోజుల్లో సబ్ కలెక్టర్, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్థలం కేటాయింపుతోపాటు భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, ఆర్అండ్పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ, భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నీటిపారుదల శాఖమంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి పొంగులేటి మాట్లాడారు. పేదోడి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అప్పుల తెలంగాణగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడ్తున్నామని చెప్పారు. ఇంటి స్థలం ఉన్న వారికి నాలుగు విడతల్లో రూ.5లక్షలు చెల్లిస్తామన్నారు. ఇస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ప్రొసీడింగ్స్ అందజేశారు.
పేదల అభ్యున్నతే లక్ష్యం
– శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మంజూరు పత్రాలు అందుకునే లబ్ధిదారుల మొఖాలు చూస్తే సంతోషంగా ఉందన్నారు. పేదలందరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు.
ఫ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఫ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
బడిబాట పోస్టర్ ఆవిష్కరణ
విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం పోస్టర్, కరపత్రాలను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం దీరావత్ ధర్మానాయక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్ రవినాయక్, ఉపాధ్యాయులు కొర్ర కృష్ణకాంత్నాయక్, తావుర్యా, అనిత, జ్యోతి, ధనలక్ష్మి, స్పందన, భవాని, మీనా, రేణుక పాల్గొన్నారు.

పది రోజుల్లో భవనాలకు నిధులు