ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పూజలు | - | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పూజలు

Jun 8 2025 1:23 AM | Updated on Jun 8 2025 1:23 AM

ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పూజలు

ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పూజలు

కనగల్‌ : దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ పుట్ట మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అమ్మవారి ఆలయంతోపాటు దర్వేశిపురం, కనగల్లు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జల్లెపల్లి జయరామయ్య, చైర్మన్‌ చిదేటి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ధర్మకర్తలు నగేష్‌గౌడ్‌, నవీన్‌గౌడ్‌, శంకర్‌రెడ్డి, రాజు, నరేష్‌, వెంకటయ్య, బాబు, రమేష్‌, దుర్గమ్మ, అర్చకులు మల్లాచారి, శ్రవణ్‌కుమార్‌, ఉమామహేశ్వరరావు, దామోదర్‌, పణి, నాగరాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ చంద్రయ్య, నాగేశ్వరరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ ఉపేందర్‌రెడ్డి, ఆంజనేయులు, రాజయ్య, రాజు, శ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement