ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

Jun 7 2025 1:22 AM | Updated on Jun 7 2025 1:22 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

పెద్దఅడిశర్లపల్లి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం గుడిపల్లి మండలంలోని కేశంనేనిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. మండలంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపికై న కేశంనేనిపల్లిలో 98 ఇళ్లు మంజూరు కాగా 42 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఘనిపల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సును ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ రాజ్‌కుమార్‌, ఆర్డీవో రమణారెడ్డి, తహసీల్దార్‌ మధుహాసిని పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన

గుర్రంపోడు : మండలంలోని జూనూతులలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వ విధివిదానాలకు లోబడే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకుంటే పూర్తిగా డబ్బులు వస్తాయని తెలిపారు. జూనూతుల గ్రామంలో మొదటి విడతలో 30 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా.. అందులో 23 మంది నిర్మాణాలు మొదలు పెట్టగా 12 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, ఎంపీడీఓ మంజుల తదితరులు ఉన్నారు.

ఫ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement