యాదవ ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

యాదవ ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలి

Jun 2 2025 1:33 AM | Updated on Jun 2 2025 1:33 AM

యాదవ ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలి

యాదవ ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలి

నల్లగొండ : యాదవ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి వృత్తి గౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా యాదవ సంఘ భవనంలో నూతన యాదవ ఉద్యోగుల ఆత్మీయ సన్మానోత్సవంలో ఆయన మాట్లాడారు. నూతన ఉద్యోగులంతా తమ శక్తి మేరకు, కుటుంబ సభ్యుల సహకారంతో ఉద్యోగాలు పొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. గొల్లకురుమలు నీతికి నిజాయితీకి మారుపేరని, నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన యాదవులు అంకితభావంతో పని చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర పోలీస్‌ కంప్లయింట్‌ అథారిటీ సభ్యులు డాక్టర్‌ వర్రె వెంకటేశ్వర్లును సన్మానించారు. కార్యక్రమంలో బడుగుల లింగయ్యయాదవ్‌, జవ్వాజి వెంకటేశంయాదవ్‌, తరాల పరమేశ్‌యాదవ్‌, అర్వ అశోక్‌యాదవ్‌, బెల్లి యాదయ్య, లొడంగి గోవర్ధన్‌, ముచ్చర్ల ఏడుకొండలు, దూదిమెట్ల బాలరాజుయాదవ్‌, పిల్లి రామరాజుయాదవ్‌, ఎల్‌వీ.యాదవ్‌, పల్లెబోయిన శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే

బీర్ల అయిలయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement