పాలకులు మారినా విధానాలు మారలే | - | Sakshi
Sakshi News home page

పాలకులు మారినా విధానాలు మారలే

Jun 2 2025 1:33 AM | Updated on Jun 2 2025 1:33 AM

పాలకులు మారినా విధానాలు మారలే

పాలకులు మారినా విధానాలు మారలే

మిర్యాలగూడ : పాలకులు మారినా విధానాలు మారడం లేదని.. రాష్ట్ర అభివృద్ధి నేటికీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని దీనివల్ల ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయించడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో గ్రామపంచాయతీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, పాదూరి శశిధర్‌రెడ్డి, పారేపల్లి సత్యనారాయణరావు, లింగయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement