కుటుంబ సభ్యులు మందలించారని తీవ్ర నిర్ణయం తీసుకున్న విద్యార్థి! | - | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యులు మందలించారని తీవ్ర నిర్ణయం తీసుకున్న విద్యార్థి!

Dec 21 2023 2:06 AM | Updated on Dec 21 2023 11:24 AM

- - Sakshi

మిర్యాలగూడ అర్బన్‌: కుటుంబ సభ్యులు మందలించారని ఓ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం ముప్పారం గ్రామానికి చెందిన గుంటుపల్లి శ్రీనాథ్‌(15) మిర్యాలగూడ పట్టణంలోని ఎస్టీ వెల్ఫేర్‌ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు.

శ్రీనాథ్‌ రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లకుండా పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో వడ్డించేందుకు క్యాటరింగ్‌ బృందంతో కలిసి వెళ్లాడు. శ్రీనాథ్‌ పాఠశాలకు హాజరు కావడం లేదని హాస్టల్‌ సిబ్బంది అతడి తల్లికి సమాచారం అందించారు. శ్రీనాథ్‌ను కుటుంబ సభ్యులు ఫోన్‌లో అతడిని మందలించారు.

మనస్తాపం చెందిన శ్రీనాథ్‌మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో హాస్టల్‌ నుంచి బయటకు వచ్చి మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉదయం రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ హుస్సేన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement