జీల్దార్తిప్ప చెరువుకు నీటి తరలింపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. మొదట మొలచింతలపల్లి వాగు వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలని, తర్వాత కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించడం జరిగింది. కానీ, కాల్వలు తవ్వేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పైప్లైన్ ఏర్పాటు అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వారి ఆదేశాల తర్వాతనే పనులు ప్రారంభం అవుతాయి.
– అమర్సింగ్, నీటిపారుదల శాఖ డీఈ
మా గ్రామాలకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చాలాసార్లు చెప్పినా పనులు మాత్రం ప్రారంభించడం లేదు. మొదట్లో కాల్వల ద్వారా నీటిని తరలిస్తామని, ఇప్పుడు పైప్లైన్ల ద్వారా అంటున్నారు. త్వరగా పనులు చేపట్టి రైతులకు మేలు చేయాలి.
– గోవిందు, రైతు, మొలచింతలపల్లి గ్రామం
●


