హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ప్రారంభం

Apr 7 2026 8:19 AM | Updated on Apr 7 2026 8:19 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లా పరేడ్‌ మైదానంలోని మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫూల్‌లో ఆధునిక వాహనాల మరమ్మతుల కోసం నూతనంగా ఏర్పాటు చేసి టూపోస్ట్‌ హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ను సోమవారం డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీస్‌ విభాగంలో వాహనాల నిర్వహణ అత్యంత కీలకమని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు సిద్ధంగా ఉండటం చాలా అవసరమన్నారు. ఈ టూ పోస్ట్‌ హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ వల్ల వాహనాలను సులభంగా పైకి ఎత్తడం, తక్కువ సమయంలో మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి, అదనపు ఎస్పీ సురేష్‌కుమార్‌, డీఎస్పీలు రమణారెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement