
లోక్అదాలత్లో 17,495 కేసులు పరిష్కారం
కందనూలు: జిల్లాలోని న్యాయస్థానాల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో 17,495 కేసులను పరిష్కరించారు. జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించిన లోక్అదాలత్లో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రమాకాంత్ పాల్గొని వివిధ కేసుల్లో రాజీ అయిన కక్షిదారులకు ఆర్డర్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమన్నారు. కక్షిదారులకు సమయం, డబ్బులు ఆదా అవుతాయన్నారు. జాతీయ లోక్అదాలత్లో సివిల్ కేసులతో పాటు ఎకై ్సజ్, ఎలక్ట్రిసిటీ, బ్యాంక్ కేసులు, పెట్టి తదితర కేసులను పరిష్కరించినట్లు వివరించారు. రూ.58,37,519 కాంపౌండింగ్ ఫీజు కింద వసూలైనట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీమా సుల్తానా మాట్లాడుతూ.. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను కొందరు అనివార్య కారణాలతో కట్టలేకపోతున్నారని.. లోక్అదాలత్ ద్వారా సెటిల్ చేసుకున్న వారికి బ్యాంకర్లు వడ్డీతో పాటు అసలు కూడా కొంతవరకు మాఫీ చేసే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి శ్రీనిధి, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్రావు పాల్గొన్నారు.