బియ్యం దందా? | - | Sakshi
Sakshi News home page

బియ్యం దందా?

Jun 15 2025 7:38 AM | Updated on Jun 15 2025 7:38 AM

బియ్యం దందా?

బియ్యం దందా?

ఏటూరునాగారం: రేషన్‌ బియ్యం కోసం ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్‌, జూలై, ఆగస్టుకు సంబంధించిన బియ్యం ఒకేసారి లబ్ధిదారులకు జూన్‌లోనే పంపిణీ చేస్తున్నాయి. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో బియ్యం ఆయా కుటుంబాలకు వస్తుండడంతో లబ్ధిదారులపై దళారుల చూపు పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బియ్యాన్ని విక్రయించాలని దళారులు దందాకు తెరలేపుతూ లబ్ధిదారుల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ఒకేసారి మూడు నెలల బియ్యం నిల్వ చేసుకునేందుకు లబ్ధిదారులు ఇళ్లకు తరలించే క్రమంలో మధ్యలోనే దళారులు తక్కువ ధరలకు బేరాలు చేసుకొని అక్రమమార్గంలో రేషన్‌ బియ్యాన్ని రాష్ట్రం దాటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో సభ్యుడికి 6 కిలోల బియ్యం

కేంద్రం ప్రభుత్వం ఆహార భద్రత కింద ఒక సభ్యుడికి 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో చొప్పున ఉచితంగా రేషన్‌కార్డు లబ్ధిదారులకు అందజేస్తోంది. రేషన్‌పాపుల ద్వారా ఒక్కో లబ్ధిదారుడి వేలి ముద్రలను డీలర్లు తీసుకుని సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. బియ్యం పంపిణీ చేసే క్రమంలో ఒక్కో లబ్ధిదారుడు మూడు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి ఇస్తుండడంతో రేషన్‌కార్డుదారులందరూ బియ్యం తీసుకుంటున్నారు.

దళారులపై నిఘా అవసరం

అక్రమ మార్గంలో రేషన్‌ బియ్యం తరలిస్తున్న దళారులపై అధికారులు నిఘా వేసి ఉంచాలని లబ్ధిదారుడుల కోరుతున్నారు. లబ్ధిదారుల వద్ద బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి దళారులు సొమ్ము చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాంటి దళారులపై ఉన్నతాధికారులు దృష్టి సారించి బియ్యం దందాకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది.

మరో 15రోజులుగా బియ్యం పంపిణీ

జిల్లాలో మొత్తం 277 రేషన్‌ షాపులు ఉన్నాయి. 6,746 మెట్రిక్‌ టన్నులు సన్నబియ్యం దిగుమతి కాగా 5,468 మెట్రిక్‌ టన్నులు బియ్యం ఇప్పటి వరకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 1,277 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేయాల్సి ఉంది. 80శాతం బియ్యం పంపిణీ పూర్తి అయ్యింది. మరో 15 రోజుల్లో మొత్తంగా బియ్యం పంపిణీ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.

– రాంపతి, సివిల్‌ సప్లయీస్‌ డీఎం

జిల్లాలో రేషన్‌ కార్డులు, బియ్యం పంపిణీ వివరాలు

వినియోగదారులపై దళారుల చూపు

తక్కువ ధరకు కొనుగోలు

ఇప్పటికే 80శాతం బియ్యం పంపిణీ

మండలం వచ్చిన కార్డుల పంపిణీ చేసిన

బియ్యం సంఖ్య బియ్యం(శాతంలో)

ఏటూరునాగారం 9,483 4,823 78.46

గోవిందరావుపేట 10,208 3,992 78.69

కన్నాయిగూడెం 4,261 1,647 66.82

మంగపేట 15,053 5,104 71.86

ములుగు 19,168 7,787 76.29

ఎస్‌ఎస్‌తాడ్వాయి 6,917 3,062 71.86

వెంకటాపురం(ఎం) 10,783 4,609 76.37

వెంకటాపురం(కె) 10,357 4,145 73.65

వాజేడు 8,398 2,363 54.40

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement